Share News

ప్రయివేటు స్కూల్స్‌లో దోపిడీని ఆపాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:31 AM

ప్రయివేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూళ్లు చేయడమే కాక పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయిస్తూ నిలువునా దోచేస్తున్నారని, అధికారులు చొరవ తీసుకొని తక్షణం ఆ దోపిడీని అరిక ట్టాలని గడ్డమణుగు ఎంపీటీసీ సభ్యురాలు నూతక్కి అపర్ణ కోరారు.

ప్రయివేటు స్కూల్స్‌లో దోపిడీని ఆపాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీనివాసరావు

జి.కొండూరు, జూలై 4: ప్రయివేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూళ్లు చేయడమే కాక పుస్తకాలు, నోటు పుస్తకాలు విక్రయిస్తూ నిలువునా దోచేస్తున్నారని, అధికారులు చొరవ తీసుకొని తక్షణం ఆ దోపిడీని అరిక ట్టాలని గడ్డమణుగు ఎంపీటీసీ సభ్యురాలు నూతక్కి అపర్ణ కోరారు. ఎంపీపీ వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ అధ్యక్షతన గురువారం మండల సమావేశం జరిగింది. దీనిపై ఎంఈవో పజ్జూరు వెంకట నరసింహారావు స్పందిస్తూ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీపీ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌ వి.వి.ఎల్‌.నరసింహారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:31 AM