Share News

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:00 AM

అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం జంక్షన్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు.

 పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం
బాపులపాడు డీటీకి వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

హనుమాన్‌జంక్షన్‌, ఫిబ్రవరి 19 : అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం జంక్షన్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫొటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు. జంక్షన్‌లోని నాలుగు రోడ్లులో ప్రదర్శన అనంతరం బాపులపాడు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కొద్ది సేపు ధర్నా నిర్వహించి, డీటీ రమణకు వినతిపత్రం అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు అట్లూరి రాజశేఖర్‌, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రొంపెల్లి అచ్యుతరావు, జంక్షన్‌ జర్నలిస్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ కార్యదర్శి కె. బాలస్వామి, ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, వివిధ పత్రికా విలేకరులు మేడేపూడి వెంకటేశ్వర రావు, అంకమబాబు, సీహెచ్‌ శ్రీనివాసరావు, కరీం, రవి,కిరణ్‌, రమేష్‌, పవన్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కంకిపాడు : ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌పై దాడి పత్రిక స్వేచ్ఛపై దాడి అని దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. స్థానిక విలేక రులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ, అనంతపురంలో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేయడం సిగ్గుచేటన్నారు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించ టమే అన్నారు. చిన్నపాటి ఉద్యో గాలు చేసుకునే ఇటువంటి వారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఉయ్యూరు : రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకల దాడిపట్ల సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది. సిద్ధం సభలో శ్రీకృష్ణపై దాడిచేసి తీవ్రంగా గాయపరచడం పట్ల పలువురు నాయకులు ప్రతిస్పదించారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాల పైనా వైసీపీ మూకల దాడులు పెరగగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నిలిచే జర్నలిస్టులపై దాడిచేయడం ప్రజా స్వామ్యానికే మచ్చఅని ఉమ్మడి కృష్ణాజిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు గోలి వసంతకుమార్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Feb 20 , 2024 | 01:00 AM