ఓటమి అంచున వైసీపీ
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:38 AM
ఓటమి భయంతో వైసీపీ ఎమ్మె ల్యే అభ్యర్థులు పొటే చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని పెనమలూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం లోని తెన్నేరు, మంతెన గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
![ఓటమి అంచున వైసీపీ](https://media.andhrajyothy.com/media/2024/20240407/12pnkpd3_2887449013.jpg)
తెన్నేరు/మంతెన (కంకిపాడు), ఏప్రిల్ 12 : ఓటమి భయంతో వైసీపీ ఎమ్మె ల్యే అభ్యర్థులు పొటే చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని పెనమలూరు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు. కంకిపాడు మండలం లోని తెన్నేరు, మంతెన గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెన్నేరులో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో డ్రెయినేజీ, రోడ్లు అభివృద్ధి జరిగిందనీ, మంతెన గ్రామంలో కూడా అదే విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశా మని గర్వంగా చెప్పగలమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త ముప్పా రాజా, సుదిమళ్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.