Share News

మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:31 AM

మంచినీటి సమస్యపై శుక్రవారం పటమట సర్కిల్‌-3 కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.

మంచినీటి సమస్యపై   ఖాళీ బిందెలతో మహిళల నిరసన

మంచినీటి సమస్యపై

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

పటమట, జూన్‌ 7 : మంచినీటి సమస్యపై శుక్రవారం పటమట సర్కిల్‌-3 కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మొగల్రాజపురంలోని 7వ డివిజన్‌ సున్నపుబట్టీల సెంటర్‌, దాసరి రమణ నగర్‌, ఇందిరానగర్‌, చర్చిరోడ్డు ప్రాంతాల్లో గత రెండు నెలలుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారని, అధికారులు సమస్య పరిష్కరించక పోవడంతో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యద ర్శివర్గ సభ్యుడు అప్పరబోతు రాము మాట్లాడుతూ కొత్త మోటార్‌ తీసుకువచ్చి పది రోజులు అయ్యిందని దానిని బిగించడానికి టైం లేదని అధికారులు చెప్పటం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సీపీఐ డివిజన్‌ కార్యదర్శి పూసర్ల లక్ష్మణ, మహిళా సమైక్య నాయకురాలు బి. శాంత, పూసర్ల పాప, కాంతమ్మ, సింహాచలం, కుమారి, విజయకుమారి, కోటేశ్వరమ్మ, భవానీ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 12:31 AM