మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో చేరడం లేదు
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:49 AM
‘‘మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. మాకు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీలో చేరడం లేదు. అవాస్తవ ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దు.’’ అని ఆయన కుమారుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్ స్పష్టం చేశారు.
![మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో చేరడం లేదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆ పార్టీ నుంచి ఆహ్వానం వాస్తవమే
అవాస్తవ ప్రచారాలను అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దు..కుమారుడు మండలి వెంకట్రామ్ స్పష్టీకరణ
అవనిగడ్డ, ఫిబ్రవరి 28: ‘‘మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదు. మాకు వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీలో చేరడం లేదు. అవాస్తవ ప్రచారాలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దు.’’ అని ఆయన కుమారుడు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి సామాజిక, ప్రసార మాధ్యమాల్లో బుద్ధప్రసాద్ వైసీపీలో చేరుతున్నట్లు భారీగా ప్రచారం జరగడంతో బుధవారం వెంకట్రామ్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.