Share News

వీడియోకాల్‌ చేసి.. రూ.30 లక్షలు కొట్టేశారు..!

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:55 AM

‘మీరు సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. ముంబయిలో ఆయన నేరాలు చేసి సంపాదించిన డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతోంది. మీ పేరు మీద ముంబయిలో రెండు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి. మీరు ముంబయి క్రైం బ్రాంచ్‌ ముందు విచారణకు హాజరు కావాలి. ముందు మేం చెప్పిన అకౌంట్‌లో రూ.30 లక్షలు జమ చేయండి. ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదని తేలితే డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.’ నగరానికి చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగికి ఓ వ్యక్తి వీడియోకాల్‌ చేసి చెప్పిన మాటలివి. ఇది నిజమేనని నమ్మిన ఆయన అవతలి వ్యక్తులు చెప్పినట్టు బ్యాంక్‌ అకౌంట్లో డబ్బు డిపాజిట్‌ చేశాడు. ఆనక మోసపోయానని గ్రహించిన సదరు ఉద్యోగి విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిం చాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు విశాఖపట్నం కేంద్రంగా సిమ్‌కార్డులు విక్రయించే మ్యూల్‌ గ్యాంగ్‌ వివరాలు బయటపడ్డాయి. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఆ వివరాలు వెల్లడించారు.

వీడియోకాల్‌ చేసి.. రూ.30 లక్షలు కొట్టేశారు..!

నగరంలో మోసపోయిన రిటైర్డ్‌ ఉద్యోగి

కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు

విశాఖ కేంద్రంగా బయటపడిన మ్యూల్‌ గ్యాంగ్‌ ఆగడాలు

సైబర్‌ నేరగాళ్లకు నకిలీ సిమ్‌కార్డుల విక్రయం

ఏడుగురు మ్యూల్‌ గ్యాంగ్‌ సభ్యుల అరెస్టు

‘మీరు సినీనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. ముంబయిలో ఆయన నేరాలు చేసి సంపాదించిన డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతోంది. మీ పేరు మీద ముంబయిలో రెండు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి. మీరు ముంబయి క్రైం బ్రాంచ్‌ ముందు విచారణకు హాజరు కావాలి. ముందు మేం చెప్పిన అకౌంట్‌లో రూ.30 లక్షలు జమ చేయండి. ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదని తేలితే డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.’ నగరానికి చెందిన ప్రభుత్వ మాజీ ఉద్యోగికి ఓ వ్యక్తి వీడియోకాల్‌ చేసి చెప్పిన మాటలివి. ఇది నిజమేనని నమ్మిన ఆయన అవతలి వ్యక్తులు చెప్పినట్టు బ్యాంక్‌ అకౌంట్లో డబ్బు డిపాజిట్‌ చేశాడు. ఆనక మోసపోయానని గ్రహించిన సదరు ఉద్యోగి విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయిం చాడు. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు విశాఖపట్నం కేంద్రంగా సిమ్‌కార్డులు విక్రయించే మ్యూల్‌ గ్యాంగ్‌ వివరాలు బయటపడ్డాయి. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఆ వివరాలు వెల్లడించారు.

విజయవాడ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : కొద్దిరోజుల క్రితం సూర్యారావుపేటకు చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగికి ముంబయి సైబర్‌ క్రైం డీసీపీనని చెప్పి ఓ వ్యక్తి వీడియోకాల్‌ చేశాడు. రాజ్‌కుంద్రా చేసిన మోసాల ద్వారా సంపాదించిన డబ్బు ఆయన అకౌంట్లలో జమ అవుతున్నాయని, ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని హిందీ, ఇంగ్లీష్‌లో చెప్పాడు. వాట్సాప్‌లో ఆయన ఎఫ్‌ఐఆర్‌, అరెస్టు వారెంట్‌ కాపీలను పంపించాడు. ఇవి చూడగానే రిటైర్డ్‌ ఉద్యోగి ఆందోళన చెందాడు. ఫోన్‌ చేసిన వ్యక్తి నిజంగా డీసీపీ అని భావించాడు. అతడిని బతిమాలుకోగా, దఫదఫాలుగా తాను చెప్పిన అకౌంట్‌లో రూ.30.37 లక్షలు జమ చేయాలని చెప్పాడు. రాజ్‌కుంద్రాతో ఎలాంటి సంబంధం లేదని తేలితే తిరిగి డబ్బు ఇచ్చేస్తామని చెప్పడంతో ఈ రిటైర్డ్‌ ఉద్యోగికి మరింత నమ్మకం పెరిగింది. డబ్బు ఎంతకీ తిరిగి రాకపోవడం, ముంబయి సైబర్‌ క్రైం బ్రాంచ్‌ నుంచి ఎలాంటి ఫోన్లు రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో కాల్‌ ఏ నెంబర్‌ నుంచి వచ్చిందో విచారణ చేపట్టారు. సైబర్‌ క్రైం ఏసీపీ ఎస్‌డీ తేజేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ కోమాకుల శివాజీ, ఎస్‌ఐ మూర్తి ఆధ్వ ర్యంలో ప్రత్యేక టీమ్‌ ఏర్పడింది. వీడియో కాల్‌ వచ్చిన నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వీఐ సర్వీసు ప్రొవైడర్‌ నెంబర్‌ నుంచి ఈ కాల్‌ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు సిమ్‌కార్డు ఏ చిరునామాతో ఉందో అక్కడికి వెళ్లారు. విశాఖపట్నం చిరునామా చూపించడంతో అక్కడికి వెళ్లి విచారణ చేశారు. ఈ సిమ్‌ను ఎక్కడ కొన్నారో కనుగొన్నారు.

ఒకే వేలిముద్రతో రెండు సిమ్‌ల యాక్టివేషన్‌

కొత్తగా సిమ్‌కార్డు తీసుకునే వారు సంబంధిత సర్వీసు ప్రొవైడర్‌ వద్దకు గానీ, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వద్దకు గానీ వెళ్లి ఆధార్‌ ఫొటోస్టాట్‌ చూపించి బయోమెట్రిక్‌ వేయాలి. 24 గంటల తర్వాత సిమ్‌ యాక్టివేషన్‌ అవుతుంది. ఇలా సిమ్‌ల కోసం వచ్చిన వారి వేలిముద్రతో వారు తీసుకున్న సిమ్‌ను కాకుండా మరో సిమ్‌ను యాక్టివేట్‌ చేస్తున్నారని గమనించారు. పోలీసుల విచారణలో తాము ఒక సిమ్‌ కార్డు మాత్రమే తీసుకున్నామని కొందరు వివరించారు. దీంతో అనుమానం మరింత బలపడింది. సిమ్‌కార్డుల కోసం వచ్చిన వారికి ఒకటి అధికారికంగా ఇచ్చి, మరో మ్యూల్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు గ్యాంగ్‌ వెలు గులోకి వచ్చింది. విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన రేపాక రాంజీ, నంబాల నితిన్‌, విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన తేలు ప్రణయ్‌కుమార్‌, నంద రూపేష్‌, కాగితాల సింహాద్రి, ఏలూరు జిల్లా నిడమర్రుకు చెందిన పందిరి సత్యనారాయణ, పాత గాజువాక ప్రాంతానికి చెందిన బండి నారాయణమూర్తిని అరెస్టు చేశారు. నిందితుల్లో రాంజీ వీఐ సర్వీసు ప్రొవైడర్‌ షోరూంలో డిజిటల్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తు న్నాడు. నితిన్‌ మొబైల్‌ సర్వీసింగ్‌ షాపును నిర్వహిస్తున్నాడు. విశాఖప ట్నం కేంద్రంగా మ్యూల్‌ సిమ్‌లను యాక్టివేట్‌ చేసి వాటిని సైబర్‌ నేర గాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.

ఒక్కో సిమ్‌ ఖరీదు రూ.1,500

మ్యూల్‌ గ్యాంగ్‌ సిమ్‌కార్డులను సైబర్‌ నేరగాళ్లకు విక్రయించి భారీ గానే సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సర్వీసు ప్రొవై డర్‌ నుంచి సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌కు సిమ్‌ను రూ.500కు ఇస్తారు. దీనికి ఎగ్జిక్యూటివ్‌ మరో రూ.100 లాభం వేసుకుని రూ.600కు డిస్ట్రిబ్యూట ర్‌కు విక్రయిస్తాడు. సిమ్‌లను యాక్టివేట్‌ చేసే క్రమంలో మ్యూల్‌ సిమ్‌ ను సృష్టించిన డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు కలిసి సైబర్‌ నేరగాళ్లకు ఆ సిమ్‌ లను విక్రయిస్తున్నారు. ఒక్కో సిమ్‌కార్డును సైబర్‌ నేరగాళ్లకు రూ.1,500 వరకు విక్రయించారు. ఇలా మొత్తం 30 సిమ్‌కార్డులను సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు. వాటిలో 20 సిమ్‌లను సైబర్‌ నేరగాళ్లకు విక్ర యించేశారు. ఇలా సృష్టించిన 998 మ్యూల్‌ సిమ్‌లను సైబర్‌ క్రైం పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రిటైర్డ్‌ ఉద్యోగి డబ్బు జమ చేసిన ఖాతాల వివరాలను రాబట్టిన పోలీసులు అందులో ఉన్న రూ.1.21 లక్ష లను స్తంభింపజేశారు. ఈ ఖాతాను పరిశీలించగా, ఒక్క రోజులోనే రూ.6.2 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలింది.

Updated Date - Jun 02 , 2024 | 12:55 AM