నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం
ABN , Publish Date - Feb 02 , 2024 | 01:08 AM
నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దామని మచిలీపట్నం నగర పాలకసంస్థ ఉద్యోగులకు నూతన కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు పిలుపునిచ్చారు.
![నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం](https://media.andhrajyothy.com/media/2023/20231205/1mtm05_77a19d97cc.jpg)
మచిలీపట్నం నగరపాలకసంస్థ ఉద్యోగులకు కమిషనర్ బాపిరాజు పిలుపు
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 1: నగరాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దామని మచిలీపట్నం నగర పాలకసంస్థ ఉద్యోగులకు నూతన కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు పిలుపునిచ్చారు. గురు వారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ నుంచి మచిలీపట్నానికి బాపిరాజు బదిలీపై వచ్చారు. నగరపాలక సంస్థలో పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారి స్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజాబాబును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.