వచ్చే ఎన్నికల్లో జగన్రెడ్డిని ఇంటికి పంపుదాం
ABN , Publish Date - Jan 06 , 2024 | 01:14 AM
అన్ని వర్గాల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం జగన్రెడ్డిని 2024 ఎన్నికల్లో ఇంటికి పంపుదామని ప్రజలకు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు.
![వచ్చే ఎన్నికల్లో జగన్రెడ్డిని ఇంటికి పంపుదాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆయన అన్ని వర్గాల నమ్మకాన్ని కోల్పోయారు
ప్రజలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం పిలుపు
విద్యాధరపురం, జనవరి 5: అన్ని వర్గాల నమ్మకాన్ని కోల్పోయిన సీఎం జగన్రెడ్డిని 2024 ఎన్నికల్లో ఇంటికి పంపుదామని ప్రజలకు టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్రెడ్డిపై పెల్లుబికుతున్న ప్రజాగ్రహాన్ని చూసి తట్టుకోలేక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్బై చెబుతున్నారన్నారు. ఆ పార్టీ లోని చాలామంది ఎంపీలకు వారి భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేద న్నారు. ‘‘ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్రెడ్డికి ఓటమి భయం పట్టు కుంది. దీంతో ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మారుస్తున్నారు. ఇప్పటివరకు 38 మంది సిట్టింగ్ ఎమ్మె ల్యేలు సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఎమ్మె ల్యేలు ప్రజలకు సేవ చేయడంలో విఫలమై, నిర్థాక్షిణ్యంగా దోపిడీకి పాల్ప డడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించింది. మరో 50 మంది నాయ కులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు.’’ అని నెట్టెం పేర్కొన్నారు.