Share News

అభ్యర్థుల ఖర్చుల వివరాలను సక్రమంగా నమోదు చేయాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:31 AM

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల వివ రాలను సక్రమంగా నమోదు చేయా లని పార్లమెంట్‌ ఖర్చుల పరిశీలకుడు మనీష్‌ కుమార్‌ చావ్దా అన్నారు. గన్నవరం ఆర్వో కార్యాలయాన్ని శనివారం సందర్శిం చారు.

అభ్యర్థుల ఖర్చుల వివరాలను   సక్రమంగా నమోదు చేయాలి
ఖర్చుల వివరాలను పరిశీలిస్తున్న పార్లమెంట్‌ అబ్జర్వర్‌ మనీష్‌కుమార్‌ చావ్దా

గన్నవరం, ఏప్రిల్‌ 26 : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల వివ రాలను సక్రమంగా నమోదు చేయా లని పార్లమెంట్‌ ఖర్చుల పరిశీలకుడు మనీష్‌ కుమార్‌ చావ్దా అన్నారు. గన్నవరం ఆర్వో కార్యాలయాన్ని శనివారం సందర్శిం చారు. కంట్రోల్‌ రూమ్‌, కాల్‌ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులు తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎన్నికల సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, తహసీల్ధారు పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:31 AM