జగన్ కుట్రతోనే పింఛన్దారులకు ఇబ్బందులు: కుమార్రాజా
ABN , Publish Date - Apr 04 , 2024 | 01:22 AM
పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోనే పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ- జనసేన-బీజేపీ పామర్రు అభ్యర్థి వర్ల కుమార్ రాజా అన్నారు.
![జగన్ కుట్రతోనే పింఛన్దారులకు ఇబ్బందులు: కుమార్రాజా](https://media.andhrajyothy.com/media/2024/20240326/03pmr03_40f5b86466.jpg)
పామర్రు: పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోనే పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ- జనసేన-బీజేపీ పామర్రు అభ్యర్థి వర్ల కుమార్ రాజా అన్నారు. పసు మర్రు గ్రామ సచివా లయం వద్ద బుధవారం పింఛన్ల పంపిణీ జరగక పింఛన్ దారుల పడిగాపులు పడుతుండడంతో ఎందుకు పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని గ్రామ సచి వాలయ ఉద్యోగులు, సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. సాయంత్రం నాలు గు గంటలైనా సచివాలయ ఉద్యోగులు పించన్ల పంపిణీ చేయకపోవ డంపై ఎందుకు పింఛన్దారులను పడిగాపులు కాయిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు.