అన్నివర్గాలను జగన్ దగా
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:49 AM
సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
![అన్నివర్గాలను జగన్ దగా](https://media.andhrajyothy.com/media/2024/20240227/27_glp_1_e14a2241f1.jpg)
గొల్లపూడి, ఫిబ్రవరి 27: సీఎం జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో తెలుగు జన విజయకేతనం వాల్పోస్టర్ను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగే బహిరంగ సభకు వెళ్లి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధారు నాయక్, జువ్వా రామకృష్ణ, తాడికొండ రఘుపతి, షేక్ కరిముల్లా, చుట్టుకుదురు శ్రీనివాసరావు, గూడపాటి పద్మశేఖర్, నర్రా వాసు తదితరులు పాల్గొన్నారు.
పాడె మోసిన ఉమా
మైలవరం రూరల్: బాధల్లో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమాకు మైలవరం సీటు లేదన్న మనస్తాపంతో చండ్రగూడెం టీడీపీ నాయకుడు గుండెపోటుతో మృతి చెందిన లక్కింశెట్టి పుల్లారావు అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. కుటుంబాన్ని ఓదార్చి ధైౖర్యం చెప్పారు. లక్ష ఆర్థిక సాయం అందించారు. ఉమా మాట్లాడుతూ పుల్లారావు మరణం తీరని లోటన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అపోహలకు పోయి భావోద్వేగాలకు గురికావద్దని కోరారు.