Share News

పాయకాపురం చేపల మార్కెట్‌లో తనిఖీలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:05 AM

చేపల మార్కెట్‌లో తూనికలు, కొలతలు శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు.

పాయకాపురం చేపల మార్కెట్‌లో తనిఖీలు

ఆరు కాటాలు సీజ్‌ చేసిన తూనికలు కొలతలు శాఖ అధికారులు

పాయకాపురం, ఏప్రిల్‌ 7: చేపల మార్కెట్‌లో తూనికలు, కొలతలు శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. తూనికల్లో కొందరు వ్యాపారులు భారీ మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. కేజీకి అరకేజీ లెక్కన తూనికల్లో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యాపారులను గుర్తించారు. వారి కాటాలను సీజ్‌ చేశారు. వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో తూని కలు కొలతలు శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ ఎ.కృష్ణ చైతన్య, అసిస్టెంట్‌ కంట్రోలర్స్‌ భానుప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, కుమారి, ఇన్‌స్పెక్టర్లు ఈశ్వరరావు, ప్రకాష్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 01:05 AM