పారిశ్రామిక ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యం
ABN , Publish Date - Apr 12 , 2024 | 01:03 AM
పారిశ్రామిక ప్రగతి, యువ తకు ఉద్యోగాలు, ఉపాఽధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్ర బాబుతోనే సాధ్యమని, ఆయ నను ముఖ్యమంత్రిని చేసుకుం దామని టీడీపీ- జనసేన-బీజేపీ గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు సతీష్ అన్నారు.
![పారిశ్రామిక ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యం](https://media.andhrajyothy.com/media/2024/20240407/11ugtr1_87f96c8bcd.jpg)
ఉంగుటూరు, ఏప్రిల్ 11: పారిశ్రామిక ప్రగతి, యువ తకు ఉద్యోగాలు, ఉపాఽధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్ర బాబుతోనే సాధ్యమని, ఆయ నను ముఖ్యమంత్రిని చేసుకుం దామని టీడీపీ- జనసేన-బీజేపీ గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు సతీష్ అన్నారు. ప్రజాగళం పేరుతో తన సతీ మణి లక్ష్మితో కలిసి మానికొండలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం గురువారం రెండోరోజూ ఉత్సాహంగా సాగింది. మూడుపార్టీల నాయకులు, కార్య కర్తలు, తెలుగు మహిళలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన సతీష్ సూపర్సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి కలిగే లబ్ధిని ఆయన ప్రజలకు వివరించారు. గ్రామంలో అర్హులకు ఇళ్ల స్థలాలు దక్కలేదని పలువురు మహిళలు సతీష్ దృష్టికి తీసు కెళ్లారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించి, అర్హులైన పేదలందరికి ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నేతలు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, మండవ రమ్య, యడ్లపల్లి సాయు, బెజవాడ నాగేశ్వరరావు, ఆరికట్ల రవికుమార్, రాజ్ కుమార్, లాబాను, దాదా, వరికూటి కిషోర్, భువనేష్, రవి చంద్, నూతక్కి బెనర్జీ, ప్రకాష్, తాతినేని పార్వతి, రసూల్, ఝాన్సీ పాల్గొన్నారు.
గ్రామాల్లో టీడీపీ ముమ్మర ప్రచారం
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున పోటీచేస్తున్న యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం ఎమ్మెల్యేగా, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని కోరుతూ మండ లంలోని గ్రామాల్లో టీడీపీ గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎన్ని కల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తేలప్రోలు, పొట్టి పాడు, వేంపాడు, మానికొండ, ఆత్కూరు. పెదఅవుటపల్లి, తరి గొప్పల గ్రామాల్లో నాయకులు ఇంటింటికీ తిరుగుతూ కూట మి అధికారంలోకి వచ్చాక అమలు చేసే సూపర్సిక్స్ పథకా లపై ప్రజలకు వివరించి, అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలి పించాలని కోరుతున్నారు.