పాతశివాలయంలో కల్యాణ పుష్పయాగ మహోత్సవం ప్రారంభం
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:40 AM
స్థానిక భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం వసంత నవరాత్ర సహిత కల్యాణ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
పాతశివాలయంలో
కల్యాణ పుష్పయాగ మహోత్సవం ప్రారంభం
వన్టౌన్, ఏప్రిల్ 19: స్థానిక భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం వసంత నవరాత్ర సహిత కల్యాణ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠాపన, అఖండదీప ప్రతిష్ఠాపన, సర్వదేవతాహ్వానం, ధ్వజారోహణ, బలిహరణ కార్యక్రమాలను నిర్వహించారు, స్నపన కార్యక్రమం అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవ మూర్తులను వఽధూవరులుగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాచకొండ సుమంతశర్మ, రాచకొండ నాగరాజుశర్మ, అభిషేక పురోహితుడు కొత్తపల్లి సాయి కృష్ణశర్మల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కానూరు సురేష్ బాబు పర్యవేక్షించారు.