ఎన్నాళ్లకు..
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:23 AM
18 నుంచి మల్లేశ్వరస్వామి దర్శనం ప్రారంభం విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న మల్లేశ్వరస్వామి దర్శనభాగ్యం ఫిబ్రవరి 18 నుంచి కల్పించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నగరంలోని జమ్మిదొడ్డిలో ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
![ఎన్నాళ్లకు..](https://media.andhrajyothy.com/media/2023/20231205/DSC_0722_6fc3618539.jpg)
18 నుంచి మల్లేశ్వరస్వామి దర్శనం ప్రారంభం
విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న మల్లేశ్వరస్వామి దర్శనభాగ్యం ఫిబ్రవరి 18 నుంచి కల్పించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నగరంలోని జమ్మిదొడ్డిలో ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు ఈ వివరాలను వెల్లడించారు. మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం జగన్ గత డిసెంబరు 7న ప్రారంభించారు. పనులు పూర్తికాకపోయినా ఆలయాన్ని ప్రారంభించిన అధికారులు దర్శనాలు మాత్రం కల్పించలేదు. ఫిబ్రవరి 18 నుంచి శివాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.