Share News

ఎన్నాళ్లకు..

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:23 AM

18 నుంచి మల్లేశ్వరస్వామి దర్శనం ప్రారంభం విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న మల్లేశ్వరస్వామి దర్శనభాగ్యం ఫిబ్రవరి 18 నుంచి కల్పించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నగరంలోని జమ్మిదొడ్డిలో ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నాళ్లకు..

18 నుంచి మల్లేశ్వరస్వామి దర్శనం ప్రారంభం

విజయవాడ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న మల్లేశ్వరస్వామి దర్శనభాగ్యం ఫిబ్రవరి 18 నుంచి కల్పించనున్నారు. దీనికి సంబంధించి సోమవారం నగరంలోని జమ్మిదొడ్డిలో ఉన్న సమావేశ మందిరంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కమిటీ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్‌ రామారావు ఈ వివరాలను వెల్లడించారు. మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం జగన్‌ గత డిసెంబరు 7న ప్రారంభించారు. పనులు పూర్తికాకపోయినా ఆలయాన్ని ప్రారంభించిన అధికారులు దర్శనాలు మాత్రం కల్పించలేదు. ఫిబ్రవరి 18 నుంచి శివాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వారు స్పష్టం చేశారు.

Updated Date - Jan 30 , 2024 | 01:23 AM