Share News

మహోన్నతుడు దామోదరం సంజీవయ్య

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:55 AM

మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య మహోన్నతుడు అని ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థా నాలకు ఎదగాలని ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్ర సాద్‌ సూచించారు.

మహోన్నతుడు దామోదరం సంజీవయ్య
సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌, కలెక్టర్‌ రాజాబాబు

మచిలీపట్నం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య మహోన్నతుడు అని ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థా నాలకు ఎదగాలని ఎస్సీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్ర సాద్‌ సూచించారు. దామోదరం సంజీ వయ్య 103వ జయంతి కార్యక్రమాన్ని బుఽధవారం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ హాలులో నిర్వహించారు. సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో రుగ్మతలను విద్యద్వారా ఛేదించి ముఖ్యమంత్రి స్థానానికి సంజీవయ్య ఎదిగారని అన్నారు. అందరికీ విద్యను అందించాలనే సంక ల్పంతో సంజీవయ్య అనేక సంస్కరణలను అమలు చేశారని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. క్రిష్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జక్కుల ఆనందబాబు, డీఆర్వో చంద్రశేఖర్‌, సాంఘికసంక్షేమశాఖ డీడీ షాహిద్‌బాబు, దళిత సంఘాల నాయకులు కొడమంచి చంద్రశేఖర్‌, ఎగ్గోని గాంధీ, బేతపూడిరవి పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:55 AM