ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు : సీఐ
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:40 AM
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఆటంకం కల్గించే ప్రయత్నం చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పటమట సీఐ మోహనరెడ్డి తెలిపారు.
ఎన్నికలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు : సీఐ
గుణదల, మార్చి 21: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఆటంకం కల్గించే ప్రయత్నం చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని పటమట సీఐ మోహనరెడ్డి తెలిపారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్పనగర్, పటమట డొంకరోడ్డు తదితర ప్రాంతాల్లో గురువారం సాయుధ దళాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి స్థానికుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టి పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. పటమట ఎస్ఐలు శాతకర్ణి, వల్లి పద్మ తదితరులు పాల్గొన్నారు.