Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:25 AM

వెన్ననపూడి గ్రామానికి మంచినీటి ప్లాంట్‌, గ్రామా భివృద్ధికి కావాల్సిన సౌకర్యాలను టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము సమకూర్చడంతో వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్‌ శశి పవన్‌కుమార్‌(బాబి), నాయకులు కోనేరు వెంకటేశ్వరరావు, దాసరి పండు మరో 50 మంది నాయకులు శనివారం టీడీపీలో చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి
వెనిగండ్ల, రావి సమక్షంలో టీడీపీలో చేరిన వెన్ననపూడి సర్పంచ్‌ బాబీ తదితరులు

వెన్ననపూడి సర్పంచ్‌ సహా మరో 50 మంది..

నందివాడ, జనవరి 27: వెన్ననపూడి గ్రామానికి మంచినీటి ప్లాంట్‌, గ్రామా భివృద్ధికి కావాల్సిన సౌకర్యాలను టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము సమకూర్చడంతో వైసీపీ నుంచి గ్రామ సర్పంచ్‌ శశి పవన్‌కుమార్‌(బాబి), నాయకులు కోనేరు వెంకటేశ్వరరావు, దాసరి పండు మరో 50 మంది నాయకులు శనివారం టీడీపీలో చేరారు. గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వారిని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము పార్టీలోకి ఆహ్వానించారు. గుడి వాడ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జీ), దానేటి సన్యాసి రావు, చాట్రగడ్డ రవి, సురేష్‌, సతీష్‌, ఉప్పల వెంకటేశ్వరరావు, మహేష్‌, స్వామి, గంగాధర్‌, గ్రామస్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 01:25 AM