Share News

జే ట్యాక్స్‌ నుంచి త్వరలో విముక్తి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:24 AM

వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జే ట్యాక్స్‌ నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు.

జే ట్యాక్స్‌ నుంచి త్వరలో విముక్తి
గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్‌సేల్‌ మార్కెట్‌లో కేశినేని శివనాథ్‌ ప్రచారం

గొల్లపూడి, ఏప్రిల్‌ 26: వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జే ట్యాక్స్‌ నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. గొల్లపూడిలోని మహాత్మా గాంధీ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా రాష్ట్రంలో వ్యాపా రులు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వైసీపీ నాయకులు దోపిడీకి చాలా మంది వ్యాపా రాలు చేయలేక మానుకున్నారన్నారు. ఈసందర్భంగా కాంప్లెక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పర్చూర్‌ నాగేశ్వరరావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా మందిరంలో చిన్ని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్‌ ఆధ్వర్యంలో ప్రతి షాపు తిరిగి ప్రచారం నిర్వహించారు. ముఠా కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే ఇళ్లు లేని ముఠా కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సోలంకి రాజు, చెన్నుపాటి వజీర్‌, గడ్డం రాఘవేంద్ర, కాకుల నారాయణరావు, బొమ్మసాని సుబ్బారావు, జాలాది వెంకటేశ్వరరావు, సూదలబత్తుల వెంకట్‌, నిమ్మగడ్డ వెంకటేశ్వ రరావు, వక్కలగడ్డ భాస్కరరావు, వెలగపూడి శంకర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:24 AM