27 నాటికి మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:42 AM
మండల కమిటీలు ఈనెల 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు

27 నాటికి మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
దగ్గుబాటి పురంధేశ్వరి
అజిత్సింగ్నగర్, డిసెంబరు 21 (ఆంధ్ర జ్యోతి) : మండల కమిటీలు ఈనెల 27వ తేదీ నాటికి పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బీజేపీ సంస్థాగత ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడుతూ పార్టీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి పాకా వెంకట సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు.