ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:52 AM
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బోడె ప్రసాద్ సూచించారు.
![ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి](https://media.andhrajyothy.com/media/2024/20240229/29pnvyr5_2312cfed7b.jpg)
ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి
పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్
కాటూరు(ఉయ్యూరు), ఫిబ్రవరి 29 : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బోడె ప్రసాద్ సూచించారు. కాటూరులో గురువారం క్లస్టర్, కన్వీనర్లు, బూత్ ఇన్చార్జ్లతో ఓటర్ల జాబితా, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటర్ల జాబితాలో అధికార పార్టీ నాయకులు అవక తవకలకు పాల్పడ్డారని, టీడీపీ ఓట్లు తొలగింప జేసినట్టు అన్ని చోట్ల నుంచి సమాచారం వస్తుంద న్నారు. తొలగించిన ఓట్లు తిరిగి చేర్పించి వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, కొండా ప్రవీణ్, ఎస్ వెంకటనారాయణ, సజ్జా మధు, వేమూరు శ్రీనివాసరావు, సూరపనేని వరప్రసాద్, గుర్రం చంద్రశేఖర్, యుగబాబు, గోలి వసంతకుమార్ పాల్గొన్నారు.