Share News

టీడీపీ, జనసేన నేతల ఆధ్వర్యంలో విస్తృతప్రచారం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:18 PM

పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.సుజనా చౌదరి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ 44, 45 డివిజన్లలో జనసేన, టీడీపీ డివిజన్ల అధ్యక్షులు గురువారం విస్తృతప్రచారం నిర్వహించారు.

టీడీపీ, జనసేన నేతల ఆధ్వర్యంలో విస్తృతప్రచారం
45వ డివిజన్‌ ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు పేరం సత్యనారాయణ, రాంబాబు

టీడీపీ, జనసేన నేతల ఆధ్వర్యంలో విస్తృతప్రచారం

భవానీపురం, ఏప్రిల్‌ 25 : పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై.సుజనా చౌదరి, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ 44, 45 డివిజన్లలో జనసేన, టీడీపీ డివిజన్ల అధ్యక్షులు గురువారం విస్తృతప్రచారం నిర్వహించారు. 44వ డివిజన్‌ లేబర్‌ కాలనీలో బొడ్డుపల్లి శ్రీనివాస రావు(టీడీపీ అధ్యక్షుడు), మల్లెపు విజయలక్ష్మి(జనసేన అధ్యక్షు రాలు), పశ్చిమ తెలుగు యువత ఉపాధ్యక్షుడు కుప్పిలి నాగ బాబు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి బడుగు గణేష్‌, నాగరాజు, ఏడుకొండలు, సత్యనారాయణ సింగ్‌లు పాల్గొన్నారు. 45వ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ, జనసేన అధ్యక్షురాలు బొమ్ము గోవిందలక్ష్మి, రాంబాబు, బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, యూనిట్‌ టీడీపీ ఇన్‌చార్జి షేక్‌ సుభానీలు సుజనా చౌదరి, శివనాథ్‌ల విజ యాన్ని కోరుతూ కబేళా సమీపంలోని శ్రీనిధి శాంతినగర్‌ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై, పోలింగ్‌ తేదీ, గుర్తులను తెలిపే కరపత్రాలను పంచిపెట్టారు.

Updated Date - Apr 25 , 2024 | 11:18 PM