విద్యుత్ శాఖ బలవంతపు వసూళ్లు నిలిపివేయాలి
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:23 AM
అదనపు డిపాజిట్ల పేరుతో బలవంతపు వసూళ్లు చేయడం విద్యుత్ శాఖ అధికారులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు
విద్యుత్ శాఖ బలవంతపు వసూళ్లు నిలిపివేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు
పాయకాపురం, మార్చి 27 : అదనపు డిపాజిట్ల పేరుతో బలవంతపు వసూళ్లు చేయడం విద్యుత్ శాఖ అధికారులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. బుధవారం పాయకాపురం శాంతినగర్ ప్రాంతంలో బాబురావు ఆ పార్టీ నేతలతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు డిపాజిట్లు చెల్లించని విద్యుత్ కనెక్షన్లను సిబ్బంది తొలగిస్తుండటాన్ని ఆయన గమనించారు. ఈ సందర్బంగా స్థానికులు తమ సమస్యలను బాబూరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాబూరావు మాట్లాడుతూ తక్షణం విద్యుత్ శాఖ బలవంతపు వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.