దుర్గమ్మకు కానుకల ఆదాయం 25 రోజులకు రూ.3.78 కోట్లు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:50 AM
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహామండపంలోని ఆరో అంతస్తులో లెక్కించారు ఈవో రామారావు, ఈఈ కోటేశ్వరరావు, పోలీసు, ప్రత్యేక పోలీసు తదితరుల పర్యవేక్షణలో మొత్తం 25 రోజులకుగాను వచ్చిన కానుకలను లెక్కించారు.
వన్టౌన్, మార్చి 27 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహామండపంలోని ఆరో అంతస్తులో లెక్కించారు ఈవో రామారావు, ఈఈ కోటేశ్వరరావు, పోలీసు, ప్రత్యేక పోలీసు తదితరుల పర్యవేక్షణలో మొత్తం 25 రోజులకుగాను వచ్చిన కానుకలను లెక్కించారు. నగదు రూపేణా రూ. 3,78,72,537, 900 గ్రాముల బంగారం, ఏడు కిలోల 820 గ్రాముల వెండి లభించింది. 3633 యూఎ్సఏ డాలర్లు, 100 ఓమన్ రియాల్స్, 20 యూకే పౌండ్లు, 30 ఆస్ట్రేలియా డాలర్లు, 135 యూరో డాలర్లు, 138 సింగపూర్ డాలర్లు, 30 యూఏఈ దీర్హమ్లు, 2.5 కువైట్ దీనార్లు, 104 ఖతార్ రియాల్స్, ఇండోనేషియా రూపాయలు 60 వచ్చాయి. ఈ హుండీ ద్వారా రూ 1,22,800 సమకూరాయి.