రాజన్నరాజ్యంలో బీసీలపై దమనకాండ చేస్తారా?
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:26 AM
‘‘రాజన్న రాజ్యంలో బీసీలపై దమనకాండ చేస్తారా? కేవలం 15 అడుగులు సిమెంట్ రోడ్డు వేయమని అడిగితే నన్ను పోలీస్స్టేషన్లో పెట్టిస్తారా? ఇదేనా బీసీల పట్ల మీ సామా జిక న్యాయం.. సీఎం జగన్మోహన్ రెడ్డి?’’ అని మైలవ రం అయ్యప్పనగర్కు చెందిన జి.వి.రమణ అనే ఓ సామా న్యుడు కన్నీరు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో పలువురిని కలచివేస్తోంది.
![రాజన్నరాజ్యంలో బీసీలపై దమనకాండ చేస్తారా?](https://media.andhrajyothy.com/media/2023/20231205/29_mymtown_2_4e6e5e942f.jpg)
మీ సామాజిక న్యాయం ఇదేనా జగన్మోహన్రెడ్డీ?
15 అడుగులు రోడ్డేయమంటే పోలీసులను పంపారు
సామాన్యుడు కన్నీటి పర్యంతం
మైలవరం, జనవరి 29: ‘‘రాజన్న రాజ్యంలో బీసీలపై దమనకాండ చేస్తారా? కేవలం 15 అడుగులు సిమెంట్ రోడ్డు వేయమని అడిగితే నన్ను పోలీస్స్టేషన్లో పెట్టిస్తారా? ఇదేనా బీసీల పట్ల మీ సామా జిక న్యాయం.. సీఎం జగన్మోహన్ రెడ్డి?’’ అని మైలవ రం అయ్యప్పనగర్కు చెందిన జి.వి.రమణ అనే ఓ సామా న్యుడు కన్నీరు పెడుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో పలువురిని కలచివేస్తోంది. అయ్యప్పనగర్లో నాలుగున్న రేళ్లుగా సీసీ రోడ్లు వేయని వైసీపీ నేతలు ఎన్నికల సమీపిస్తుండటంతో మూడు రోడ్లు మంజూరు చేశారు. ‘‘రోడ్డు పనులు చేస్తున్న వైసీపీ నాయకుడిని కొత్తగా వేస్తున్న సీసీ రోడ్డు మొదట్లో 15 అడుగుల దూరంలో నా ఇల్లు ఉంది. రోడ్డు మంజూరు కాకముందే నా ఇంటి పట్టా కాంట్రాక్టరుకు చూపాను. దాని వరకు రోడ్డు వేయమని అడిగాను. చేద్దాం.. అని ఆరోజు చెప్పాడు. ఈరోజు రోడ్డు పని చేసేందుకు కూలీలు వస్తే ఆగండి మీ కాంట్రాక్టర్ వచ్చాక పని ప్రారంభించండి అని వారికి విజ్ఞప్తి చేశాను. అయితే కాంట్రాక్టర్ రాలేదు. గుమస్తా రాలేదు. పనిచేయకుండా ఆపా నంటూ పోలీసులు వచ్చి నన్ను స్టేషన్కు తీసుకెళ్లారు. వారం నుంచి టైఫాయిడ్తో బాధపడుతున్నా.. కాళ్లు, వేళ్లు విరిగాయి. నన్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చొబెట్టారు. ట్యాబ్లెట్లు వేసుకోకుండా కూర్చుంటే ఎస్సై మాన వత్వంతో ఇంటికి పంపారు.’’ అని రమణ పెట్టినపోస్టు వైరలవుతోంది.