ముగిసిన గణితశాస్త్ర జాతీయ సదస్సు
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:09 AM
గణితశాస్త్ర అధ్యయనంతో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా కార్మెల్ అకాడమీ డైరెక్టర్ ఫాదర్ జేవియర్ రెక్స్ అన్నారు.

ముగిసిన గణితశాస్త్ర జాతీయ సదస్సు
గుణదల, మార్చి 5: గణితశాస్త్ర అధ్యయనంతో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా కార్మెల్ అకాడమీ డైరెక్టర్ ఫాదర్ జేవియర్ రెక్స్ అన్నారు. స్థానిక ఆంధ్రా లయోల కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న గణితశాస్త్ర జాతీయ సదస్సు మంగళవారంతో ముగిసింది. ఫాదర్ జేవియర్ రెక్స్ మాట్లాడుతూ కృత్రిమ మేథస్సుకు గణితశాస్త్రానికి ఉన్న సంబంధాన్ని అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు వివరించారు. కళాశాల పూర్వ విద్యార్థిగా నేటి తరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సమాజంలోని ప్రతి అంశం గణితశాస్త్రంతో ముడిపడి ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న పూర్వపు ప్రిన్సిపల్ ఫాదర్ విక్టర్ ఇమ్మాన్యుయేల్, విశ్రాంత ఆచార్యులు సి.హెచ్.శేషయ్య, డాక్టర్ ఎన్.వి.రమణ మూర్తి, బిఎన్.పద్మావతి లను ఘనంగా సన్మానించారు. కళాశాల రెక్టర్ ఫాదర్ బాలశౌరి, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ కిరణ్ కుమార్, గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పరుచూరి వేణుగోపాలరావు, కో కన్వీనర్లు తబిత, అనురాధ, అధ్యాపకులు నాగకోటేశ్వరరావు, హెప్సి బ్యూలా తదితరులు పాల్గొన్నారు.