Share News

ముగిసిన స్కౌట్స్‌, గైడ్స్‌ శిక్షణ

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:12 AM

స్థానిక పటమట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో రెండు రోజుల నుంచి జరుగుతున్న భారత స్కౌట్స్‌, గైడ్స్‌ జిల్లా బిగినర్స్‌ కోర్సు ట్రైనింగ్‌ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది.

ముగిసిన స్కౌట్స్‌, గైడ్స్‌ శిక్షణ
మాట్లాడుతున్న డీఈవో యువీ. సుబ్బారావు

ముగిసిన స్కౌట్స్‌, గైడ్స్‌ శిక్షణ

పటమట, మార్చి 5 : స్థానిక పటమట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో రెండు రోజుల నుంచి జరుగుతున్న భారత స్కౌట్స్‌, గైడ్స్‌ జిల్లా బిగినర్స్‌ కోర్సు ట్రైనింగ్‌ కార్యక్రమం మంగళవారం ఘనంగా ముగిసింది. కోర్సు డైరెక్టర్‌, జిల్లా ఇన్‌చార్జి పి.దాసు ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించి, ప్రతి పాఠశాలలోను స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యూనిట్లు స్థాపించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఈవో యువీ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలోను స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ స్థాపించటం ద్వారా పిల్లలకు క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. తద్వారా మన జిల్లాను రాష్ట్రంలో ఉన్నతస్థానంలో నిలబె ట్టాలని కోరారు. డివైఈవో కేవీఎన్‌.కుమార్‌, రాష్ట్రస్థాయి భారత్‌ స్కౌట్స్‌,గైడ్స్‌ ఆర్గనైజేషన్‌ నుంచి డి.భాస్కర్‌, రజియా సుల్తానా, కృష్ణా జిల్లా భారత స్కౌట్స్‌, గైడ్స్‌ సెక్రటరీ పి.లలిత మోహన్‌, ఎన్టీఆర్‌ జిల్లా స్కౌట్స్‌, గైడ్స్‌ కమిషనర్‌ సీహెచ్‌.సుబ్రహ్యణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ్‌సాగర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:12 AM