బీసీల బతుకు మారాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి : వీరంకి
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:47 AM
బీసీల బతుకు మారాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి చెప్పారు.
![బీసీల బతుకు మారాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి : వీరంకి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చంద్రబాబు అధికారంలోకి రావాలి : వీరంకి
మొగల్రాజపురం, మార్చి 25: బీసీల బతుకు మారాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని టీడీపీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి చెప్పారు. బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరేపి ఈశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం తూర్పు క్లస్టర్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే బీసీల మీద దాడులు పెరిగాయని, హత్యలకు తెగబడుతున్నారని అన్నారు. బీసీల జీవితాలలో వెలుగులు నింపడానికి టీడీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. బీసీల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ రెడ్డిని సాగనంపడానికి ప్రతి బీసీ టీడీపీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమానికి ముందు సుబ్బారావు కుటుంబానికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్, 6,7 డివిజన్ల అధ్యక్షులు పడాల గంగాధర్, పటమట సతీష్ చంద్ర, జనసేన 6వ డివిజన అధ్యక్షుడు శ్రీతేజ, టీడీపీ నాయకుడు నాగుమోతు రాజా,రెండు డివిజన్ల నుంచి బీసీ నాయకులు పాల్గొన్నారు.