‘చలో అమరావతి సచివాలయం’ విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 27 , 2024 | 12:10 AM
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమిలే యర్కు వ్యతిరేకంగా డిసెంబరు 19న నిర్వహించే ‘చలో అమరావతి సచివాల యం’లో దళితులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని దళిత బహు జన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేషనల్ చైర్మన్ వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపునిచ్చారు.
‘చలో అమరావతి సచివాలయం’ విజయవంతం చేయాలి
ధర్నాచౌక్, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమిలే యర్కు వ్యతిరేకంగా డిసెంబరు 19న నిర్వహించే ‘చలో అమరావతి సచివాల యం’లో దళితులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని దళిత బహు జన పార్టీ (డీబీపీ) జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ,ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నేషనల్ చైర్మన్ వడ్లమూరి కృష్ణస్వరూప్ పిలుపునిచ్చారు. కార్యక్రమ కరపత్రాన్ని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ, క్రిమిలేయర్ అమలు చేస్తే ప్రభుత్వంపై సామాజిక తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జీకే బాబు, జాతీయ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాదే సుజాత, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బండి ఈశ్వర్, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ ఆవులు ప్రవీణ్, డీబీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి పాల్గొన్నారు.