నగదు బ్యాగ్ చోరీ..దొంగను పట్టుకున్న స్థానికులు
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:23 AM
బంగారు దుకాణం యజమా నికి చెందిన నగదు బ్యాగ్ను అపహరించి పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

హనుమాన్జంక్షన్, జూన్ 6: బంగారు దుకాణం యజమా నికి చెందిన నగదు బ్యాగ్ను అపహరించి పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన గురు వారం రాత్రి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట లక్ష్మీ జ్యూయలరీ షాపు నిర్వహిస్తున్న ఆచారి తన దుకాణం మూసేసి చేతిలో ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి షట్ట ర్కు తాళాలు వేస్తుండగా దుకాణం ఎదురుగాజ్యూస్బండి వద్ద జ్యూస్ తాగుతున్న వ్యక్తి బ్యాగ్ను పట్టుకొని ఉడాయించాడు. సమీ పంలో ఉన్న మరోవ్యక్తి ద్విచక్ర వాహనంపై ఎక్కి పారిపోతుండగా దుకాణం యజమాని దొంగ దొంగ అని అరిచేసరికి స్థానికులు పట్టుకున్నారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తి వాహనాన్ని అక్కడే వదిలి పారిపోగా బ్యాగ్ దొంగిలించిన వ్యక్తి పట్టుబడ్డాడు. బ్యాగ్లో రూ.20 వేలు ఉన్నాయని ఆచారి తెలిపారు. ద్విచక్ర వాహనంతో పాటు దొంగను పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడిన వ్యక్తిది మధ్యప్రదేశ్గా భావిస్తున్నారు. రద్దీ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడడంతో జంక్షన్ సెంట ర్లో కలకలం రేగింది.