Share News

దేవినేని ఉమాపై కేసు

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:25 AM

ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ నాయకులపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

దేవినేని ఉమాపై కేసు

జక్కంపూడి కాలనీలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ఎంసీసీ టీం ఫిర్యాదు

చిట్టినగర్‌, మార్చి 23: ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ నాయకులపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం జక్కంపూడి గ్రామం జక్కంపూడి కాలనీలో దేవినేని ఉమా మరో 300 మంది టీడీపీ నాయకులతో ఎన్నికల అధికారి నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేశారని, సాధారణ ప్రజానీకానికి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తూ కాలనీ అవుట్‌పోస్ట్‌ నుంచి ర్యాలీ చేశారని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ బృందం(ఎంసీసీ టీం) కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తపేట పోలీసులు ఎంసీసీ బృందం నుంచి వీడియోలు, ఫొటోలు, వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 24 , 2024 | 01:25 AM