బీఆర్ నాయుడుకు బుద్ధప్రసాద్ అభినందన
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:04 AM
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును మండలి బుద్ధపసాద్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.

అవనిగడ్డ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్ నాయుడు నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడును మండలి బుద్ధపసాద్ బుధవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల పవిత్రత, ప్రాశస్త్యం ద్విగుణీకృతమయ్యేలా బీఆర్ నాయుడు శ్రీవారి సేవ చేస్తారని మండలి పేర్కొన్నారు. ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, అల్లుడు శీలం అశ్విన్కుమార్ పాల్గొన్నారు.