బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:47 AM
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వా త బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఉసురుపోసుకుంటున్నాడని, బ్రాహ్మణుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీ సాధికార సమితి జిల్లా కన్వీనర్ పీవీ ఫణికుమార్ అన్నారు
![బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం](https://media.andhrajyothy.com/media/2023/20231205/6pnvyr4_bde4f2d489.jpg)
ఉయ్యూరు, జనవరి 6 : రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వా త బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఉసురుపోసుకుంటున్నాడని, బ్రాహ్మణుల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పార్టీ సాధికార సమితి జిల్లా కన్వీనర్ పీవీ ఫణికుమార్ అన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన పెనమలూరు నియోజకవర్గ అధ్యక్షుడు సోమయాజుల రఘు శర్మ ఆధ్వర్యంలో స్థానిక శివాలయం ఆవరణలో శనివారం జరిగిన బ్రాహ్మ ణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం బ్రాహ్మణులను విస్మరించిందని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణ కార్పొరేషన్కు పూర్వవైభవం తీసుకువచ్చి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వారణాసి దుర్గాసారథి, పి. శ్రీనివాస్, పి సూర్యప్ర కాశ్ శాస్త్రి, పెద్దిబొట్ల రాంబాబు, పూర్ణానందం, సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ పెనమలూరు ఇన్చార్జి బోడె ప్రసాద్ను సత్కరించారు.