Share News

బీసీల అభ్యున్నతి టీడీపీతోనే

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:49 AM

బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు కేశినేని చిన్ని అన్నారు.

బీసీల అభ్యున్నతి టీడీపీతోనే
బొండా ఉమా, కేశినేని చిన్నిని సత్కరిస్తున్న వడ్డెర నాయకులు

వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో బొండా ఉమా, కేశినేని చిన్ని

అజిత్‌సింగ్‌నగర్‌, మార్చి 10: బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, బీసీలకు రాజకీయంగా గుర్తింపు తెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, సీనియర్‌ నాయకుడు కేశినేని చిన్ని అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీలోని కల్యాణ మండపంలో ఆదివారం వడ్డెర సంఘం ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. వడ్డెర సామా జికవర్గంలో అత్యధికులు భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారని, రాష్ట్రంలో ఇసుక కొరత సృష్టించి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిన ఘనుడు జగన్‌ అని వారు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డెర సాధికార సమితి ద్వారా అం దరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ముస్లింలకు న్యాయం చేసిన టీడీపీ

అజిత్‌సింగ్‌నగర్‌: రాష్ట్రంలో మస్లింలు, మైనార్టీలకు అన్ని విధాలుగా న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహే శ్వరరావు, కేశినేని చిన్ని అన్నారు. పైపులరోడ్డు వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో టీడీపీ సెంట్రల్‌ ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి మాజీ చైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగూల్‌మీరాలను బొండా ఉమా, చిన్నిలు శాలు వాలు కప్పి సత్కరించారు.

Updated Date - Mar 11 , 2024 | 12:49 AM