Share News

బీసీలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:15 AM

రాష్ట్ర బీసీలంతా చంద్రబాబుకు అండగా నిలవాలనిటీడీపీ బీసీ నాయ కులు పిలుపునిచ్చారు. బుధవారం పెనమలూరులో సీనియర్‌ నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జయహోబీసీ కార్యక్రమంలో టీడీపీ బీసీ నేతలు సంగెపు రంగారావు, శొంఠి శివరాంప్రసాద్‌, పీతా గోపీచంద్‌ మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి టీడీపీ అత్యంత ప్రాము ఖ్యతనిచ్చిందన్నారు.

 బీసీలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి

పెనమలూరు, ఏప్రిల్‌ 24 : రాష్ట్ర బీసీలంతా చంద్రబాబుకు అండగా నిలవాలనిటీడీపీ బీసీ నాయ కులు పిలుపునిచ్చారు. బుధవారం పెనమలూరులో సీనియర్‌ నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన జయహోబీసీ కార్యక్రమంలో టీడీపీ బీసీ నేతలు సంగెపు రంగారావు, శొంఠి శివరాంప్రసాద్‌, పీతా గోపీచంద్‌ మాట్లాడుతూ, బీసీల అభ్యున్నతికి టీడీపీ అత్యంత ప్రాము ఖ్యతనిచ్చిందన్నారు. కార్యక్రమంలో కోయ ఆనంద్‌ ప్రసాద్‌, బొమ్మిడి అన్నపూర్ణ, తోటకూర ఉదయభాస్కర్‌, పాముల బలరాం, షేక సైదులు, అరవపల్లి ప్రసాద్‌, వీరంకి కుటుంబరావు, కిలారి వెంకటసుబ్బారావు, నరేంద్ర, బోయపాటి వినయ్‌, బుజ్జి, కిలారు శ్రీనివాస్‌, గూడవల్లి పూర్ణ, చిగురుపాటి శ్రీనివాస్‌, మధుసూదనరావు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించాలి

ఎన్నికల్లో టీడీపీ కూటమికి ప్రజలు ఓట్లు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ కుమార్తె వైష్ణవి, అనుమోలు ప్రభాకరరావు పేర్కొన్నారు. బుధవారం పోరంకి, యనలకుదురులలో జరిగిన శంఖారావం పాదయాత్రల్లో వారు పాల్గొని మాట్లాడారు. వారి వెంట వడ్లమూడి శుభశేఖర్‌, మంచినేని పరమేష్‌, అనంతనేని ఆజాద్‌, మొక్కపాటి శ్రీనివాస్‌, శొంఠి శివరాంప్రసాద్‌, ధనేకుల బార్గవ్‌, బలగం నాగరాజు, పాదాల ప్రభాకరరావు, మల్లంపాటి విజయలక్ష్మి, మన్నెం నాగలక్ష్మి, వల్లభనేని విష్ణు, వడ్డీ జీవ, వంశీకృష్ణ, కవాటి బుజ్జి, పొట్లూరి కిరణ్‌, చెన్నుపాటి వెంకటేశ్వరరావు, గోగినేని రామారావు, బెజవాడ వెంకటేష్‌ పాల్గొన్నారు.

కాటూరులో

ఉయ్యూరు : వైసీపీ అక్రమ, అరాచక, అవినీతి పాలన అంతమొందించేందుకు రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఓట్లువేసి విజయం చేకూర్చాలని కూటమి పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థి బోడె ప్రసాద్‌ తనయుడు వెంకట్రామ్‌ అన్నారు. కాటూరులో బుధవారం పర్యటించి జనసేన మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి బాలశౌరి, టీడీపీ పెనమలూరు నియోజకవర్గ బోడె ప్రసాద్‌ తరఫున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు, చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్‌ పథకాలు వివరించి కూటమి అభ్యర్థులకు ఓట్లువేసి గెలిపించాలని అభ్యర్ధించారు. పార్టీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు, సోమవారపు వెంకటనారా యణ, కాటూరు శరత్‌బాబు, సజ్జా మధు, రవికు మార్‌, మోహన్‌రాజు, యుగబాబు పాల్గొన్నారు.

ఆరుగొలనులో..

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రైతులకు, మహిళలకు, యువతకు ఆత్మగౌరవం పెంపొందేలా చేయూత అందాలంటే టీడీపీ తోనే సాధ్యమని మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, మూ ల్పూరి సాయికళ్యాణి అన్నారు. ఆరుగొలను టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఇంటింటికీ సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బేతా శేషు కుమార్‌,తుమ్మల బ్రహ్మాజీ, కృష్ణ, లబ్బా శంకరం, వినయ్‌కుమార్‌, చొక్కాపు సత్యనారాయణ, రావులపాటి భానుకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:15 AM