Share News

బ్యానర్ల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:51 AM

కొత్తపల్లిలో టీడీపీ, జనసేన బ్యా నర్లను ధ్వంసం చేయడం కొనసాగుతుండటంతో అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు సోమవారం ఎస్సైకు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లిలో ఆదివారం అల్లరిమూకలు బ్యానర్లను ఽధ్వంసం చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

 బ్యానర్ల ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జనవరి 8 : కొత్తపల్లిలో టీడీపీ, జనసేన బ్యా నర్లను ధ్వంసం చేయడం కొనసాగుతుండటంతో అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు సోమవారం ఎస్సైకు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లిలో ఆదివారం అల్లరిమూకలు బ్యానర్లను ఽధ్వంసం చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు వెళ్లినా కూడా సోమవారం తెల్లవారుఝామున కొందరు యువకులు మిగిలిన బ్యానర్లను మళ్లీ ధ్వంసం చేయడంతో గ్రామంలోని టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌ తున్నాయి. అల్లరిమూకలు కావాలనే గ్రామంలో విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇలాంటి దుందుడుకు చర్యలు చేస్తున్నారని టీడీపీ, జనసేన నాయకులు విమ ర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వల్లూరిపల్లి నాని, అక్కినేనిరవికుమార్‌, కోరం సుధీర్‌, పొట్లూరి సుధాకర్‌, గోకుల్‌, రామిశెట్టి వరప్రసాద్‌, తమ్మినేని రాజు, తదితరులు పాల్గొన్నారు. ఫ ఫిర్యాదు సమయంలో ఎస్సై జనార్ధన్‌ సరిగా స్పందించకపోగా, బ్యానర్లకు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 09 , 2024 | 12:52 AM