జోష్ నింపిన బాబు సభ..
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:40 AM
తిరువూరులో రాకదలిరా బహిరంగ సభకు ఉహించిన దానికంటే ప్రజలు తరలి రావడంతో నాయకుల్లో నూతనోత్సహం నింపింది. వారం రోజులుగా కేశినేని శివనాథ్(చిన్ని), నియోజకవర్గం ఇన్చార్జి శావల దేవదత్ సభనిర్వాహణ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలపై దృష్టి సారించారు.
![జోష్ నింపిన బాబు సభ..](https://media.andhrajyothy.com/media/2023/20231205/7_TVR_05_87d05736b2.jpg)
తిరువూరు, జనవరి 7: తిరువూరులో రాకదలిరా బహిరంగ సభకు ఉహించిన దానికంటే ప్రజలు తరలి రావడంతో నాయకుల్లో నూతనోత్సహం నింపింది. వారం రోజులుగా కేశినేని శివనాథ్(చిన్ని), నియోజకవర్గం ఇన్చార్జి శావల దేవదత్ సభనిర్వాహణ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర అంశాలపై దృష్టి సారించారు. స్థానిక నాయకులు,కార్యకర్తలతో సమీక్షిస్తూ అందరిని సమన్వయం చేసుకుంటూ సభ విజయవంతం లక్ష్యంగా కృషి చేశారు. రాకదలిరా బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం చలోక్తులతో సాగింది. వైసీపీపై వ్యంగాస్త్రలతోపాటు, అరాచక పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను జగన్ తన పనులుగా చెప్పుకుంటున్నారంటూ విమర్శించారు. పార్టీ శ్రేణుల్లో జోస్ను పెంచారు.
స్థానిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన దేవదత్
టీడీపీ నియోజకవర్గం ఇన్చార్జి శావల దేవదత్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలను చంద్రబాబుదృష్టికి తీసుకువెళ్లారు. ఎ.కొండూరు, గంపలగూడెం, ప్రాంతాల్లో కిడ్నీ బాధితుల సమస్యను వివరించారు. వినగడప వద్ద కట్టలేరుపై వంతెనకోల్డ్స్టోరేజి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చిన్నతరహ పరిశ్రమల స్థాపన తదితర అంశాలు ప్రస్తావించారు. సభలో మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు, కేశినేని చిన్ని, బుద్ద వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్రావు, సాయిగౌడ్, పట్టాబి, వర్ల రామయ్య, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.