ఏబీవీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
ABN , Publish Date - May 21 , 2024 | 01:38 AM
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![ఏబీవీని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి](https://media.andhrajyothy.com/media/2024/20240511/rr_d682146570.jpg)
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
అమరావతి, ఆగస్టు 20(ఆంరఽధజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్య దర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం పగబట్టిందని, ఆయనను సస్పెండ్ చేసి పలు రకాలుగా వేధింపులకు గురిచేసిందని అన్నారు. ఆయనపై సస్పెన్షన్ చెల్లదని, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్(క్యాట్) ఆదేశాలిచ్చి 12 రోజులు దాటినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. అధికారుల మధ్య కూడా ఫ్యాక్షనిస్టుల మాదిరి కక్షలు సరికాదని, ఏబీవీ పట్ల కక్షపూరిత వైఖరిని విడనాడాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేస్తున్నందున ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.