Share News

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి నిందితుల అరెస్టు

ABN , Publish Date - May 31 , 2024 | 01:00 AM

ఆర్టీసీ డ్రైవర్‌ చుక్కాల శ్రీనివాసరావుపై అత్యంత పాశవికంగా దాడి చేసిన ముగ్గురు అగంతక యువకులను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సింగ్‌నగర్‌కు చెందిన పాకలపాటి సన్నీబాబు (27), కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన యాదల వెంకటబాబు (25), విజయవాడ మాచవరానికి చెందిన తోటపల్లి గోపిలుగా పోలీసులు నిర్ధారించారు. వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు.

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి నిందితుల అరెస్టు
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు

ఇబ్రహీంపట్నం, మే 30 : ఆర్టీసీ డ్రైవర్‌ చుక్కాల శ్రీనివాసరావుపై అత్యంత పాశవికంగా దాడి చేసిన ముగ్గురు అగంతక యువకులను పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సింగ్‌నగర్‌కు చెందిన పాకలపాటి సన్నీబాబు (27), కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన యాదల వెంకటబాబు (25), విజయవాడ మాచవరానికి చెందిన తోటపల్లి గోపిలుగా పోలీసులు నిర్ధారించారు. వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. నిందితులు ముగ్గురు స్నేహితులు. ఒకే వాహనంపై వస్తున్నారు. తమ వాహనాన్ని బస్సు డ్రైవర్‌ ఓవర్‌ టేక్‌ చేశాడనే అత్యంత చిన్న కారణంతో ఈమగ్గురు బస్సు డ్రైవర్‌పై దారుణంగా దాడికి పాల్పడ్డారు. బస్సులోనే ఉన్న కటింగ్‌ బ్లేయర్‌, స్ర్కూ డ్రయివర్‌తో బస్సు డ్రైవర్‌ను పొడుస్తూ అర్థగంట పాటు తీవ్రంగా హించించారు. నిస్సహాయస్థితిలో రక్తపు మడుగులో డ్రైవర్‌ కొట్టుమిట్టాడుతున్నంత సేపు చిత్ర వధ చేశారు. దాడిని గమనించిన స్థానికులు కేకలువేయడంతో వారు పరారయ్యారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఈదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిందితులపై నాన్‌బెయిల్‌ కింద కేసులు నమోదు చేయాలని, స్టేషన్‌ బెయిల్‌ రాకుండా చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలుపుదల చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 01:00 AM