Share News

వైసీపీ సమావేశంలో ఆశావర్కర్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:29 AM

రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న ఉద్యోగులు పార్టీ సమావేశాలకు, ప్రచా రాలకు దూరంగా ఉండాలని కచ్చితమైన ఆదేశాలు కొందరు వైసీపీ జపం చేస్తున్నారు.

వైసీపీ సమావేశంలో ఆశావర్కర్‌

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

లబ్బీపేట, మార్చి 23 : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న ఉద్యోగులు పార్టీ సమావేశాలకు, ప్రచా రాలకు దూరంగా ఉండాలని కచ్చితమైన ఆదేశాలు కొందరు వైసీపీ జపం చేస్తున్నారు. రాణిగారితోటలో పనిచేస్తున్న ఒక ఆశా వర్కర్‌ తాను ఒక ఉద్యోగినన్న సంగతి మరిచి వైసీపీ సమావేశంలో పాల్గొన్నారు. రాణిగారితోట 18వ డివిజన్‌లోని మాదాల వెంకటేశ్వరరావు వీధిలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న పద్మ పాలొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని, అభ్యర్థిని గెలిపించుకోవాలని తీర్మానించారు. పార్టీ సమావేశంలో పాల్గొనకూడదని తెలిసినా ఆమె పాల్గొనటంపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Mar 24 , 2024 | 01:29 AM