నామినేషన్ల దరఖాస్తులు అందుబాటులో ఉంచాం: నందిగామ ఆర్వో, ఆర్డీవో రవీంద్రరావు
ABN , Publish Date - Apr 18 , 2024 | 01:12 AM
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 18న ఉదయం 11 గంటల నుంచి నామి నేషన్లను స్వీకరిస్తాం. అని నందిగామ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీంద్రరావు తెలిపారు.
![నామినేషన్ల దరఖాస్తులు అందుబాటులో ఉంచాం: నందిగామ ఆర్వో, ఆర్డీవో రవీంద్రరావు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నందిగామ, ఏప్రిల్ 17: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈనెల 18న ఉదయం 11 గంటల నుంచి నామి నేషన్లను స్వీకరిస్తాం. 25న నామినేషన్లకు తుది గడువు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు అన్ని రకాల దరఖా స్తులు ఆర్డీవో కార్యాలయంలో అందుబాటులో ఉంచాం.’’ అని నందిగామ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో రవీంద్రరావు తెలిపారు. బుధ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను పూర్తి చేసుకుని రావాలని ఆయన సూచించారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు సంబందించి మూడు వాహనాలను మాత్ర మే తన కార్యాలయ ఆవరణలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. నామి నేషన్ వేసేందుకు అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే తన చాంబర్లోని అనుమతిస్తామని తెలిపారు. సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.