Share News

అన్నదాతకు అండగా నిలబడదాం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:12 AM

ఆరుగా లం శ్రమించి పంట పండించే రైతులకు టీడీపీ కూట మి ప్రభుత్వం ద్వారా అండగా నిలబడదామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవా డలోని యార్లగడ్డ నివాసంలో జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పొట్లూరి సీతారాం ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలసి ఘనంగా సత్కరించారు.

 అన్నదాతకు అండగా నిలబడదాం
యార్లగడ్డ వెంకట్రావును సత్కరిస్తున్న రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూన్‌ 8 : ఆరుగా లం శ్రమించి పంట పండించే రైతులకు టీడీపీ కూట మి ప్రభుత్వం ద్వారా అండగా నిలబడదామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవా డలోని యార్లగడ్డ నివాసంలో జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పొట్లూరి సీతారాం ప్రసాద్‌ ఆధ్వర్యంలో శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలసి ఘనంగా సత్కరించారు. దేశానికే అన్నదాతగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత లు ఇబ్బంది పడకుండా తన వంతుగా సహకార మందిస్తానని యార్లగడ్డ తెలిపారు. అదే విధంగా రైస్‌మిల్లర్స్‌ కూడా రైతులు ఇబ్బంది పడకుండా అండగా నిలబడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, పవన్‌కుమార్‌, పొట్లూరిరాము, శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆగని అభినందనల హోరు

పెనమలూరు : టీడీపీ కూటమి అభ్యర్ధి బోడె ప్రసాద్‌ అత్యధిక మెజారిటీతో గెలవగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు అభినంనలు తెలుపుతూనే ఉన్నారు. గురువారంతో ఎన్నికల కోడ్‌ ముగియడంతో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పోరంకి టీడీపీ కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్‌వాడీలు, రీసోర్సు పర్సన్లు శనివారం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ కృష్ణాజిల్లా మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి షేక బుజ్జి, టీడీపీ రెహమాన్‌లు శనివారం పోరంకి కార్యాలయంలో విజయోత్సవ వేడుక జరపగా బోడె ప్రసాద్‌ కేకును కోసి పంచిపెట్టారు.

Updated Date - Jun 09 , 2024 | 12:12 AM