Share News

ఉద్యోగం సాధించిన గ్రంథాలయ పాఠకునికి సన్మానం

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:50 AM

ఠాగూర్‌ గ్రంథాలయంలో రిఫరెన్స్‌ సెక్షన్‌ ఉపయోగించుకుని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కె. ఈశ్వరసాయి ప్రతాప్‌ను గ్రంథాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.

ఉద్యోగం సాధించిన గ్రంథాలయ పాఠకునికి సన్మానం
పాఠకుడిని సన్మానిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమలపూర్ణమ్మ తదితరులు

ఉద్యోగం సాధించిన గ్రంథాలయ పాఠకునికి సన్మానం

గవర్నర్‌పేట, జనవరి 20: ఠాగూర్‌ గ్రంథాలయంలో రిఫరెన్స్‌ సెక్షన్‌ ఉపయోగించుకుని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కె. ఈశ్వరసాయి ప్రతాప్‌ను గ్రంథాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. శనివారం ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ టి. జమలపూర్ణమ్మ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. నిరుద్యోగ యువతకు ఏ పుస్తకం అవసరం ఉన్నా తమ డిమాండ్‌ బుక్‌లో నోట్‌ చేస్తే 24 గంటల్లో దాన్ని అందుబాటులో ఉంచుతామని, పాఠకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రేడ్‌-1 లైబ్రేరియన్‌ కె. రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:50 AM