అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:17 AM
అమెరికాలో ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
![అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పెనమలూరు, జూన్ 8 : అమెరికాలో ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి లక్షలు వసూలు చేసి ఉడాయించిన వ్యక్తిపై బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరంలో ఉండే సాహిల్ పర్వేజ్ఖాన్ అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యనమలకుదురుకు చెందిన ఎండీ ఖాజావద్ద రూ. లక్ష, రజాక్ వద్ద రూ. రెండున్నర లక్షలు, గఫార్ వద్ద రూ. మూడు, బత్తుల నూకరత్నం వద్ద రూ. మూడు, అబ్దుల్ రజాక్ వద్ద రూ. నాలుగు , ఎస్కేరిజ్వానా వద్ద రూ. రెం డు లక్షలు వసూలు చేశాడు. ఇవి కాక శిక్షణ ఉంటుందని, దారి ఖర్చుల కింద ఒక్కొక్కరి దగ్గర ఆరు వేల చొప్పున వసూలు చేసి పరారయ్యాడు.