అంబారుపేట సత్యమ్మకు రూ.15.38 లక్షల ఆదాయం
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:33 AM
అంబారుపేట సత్యమ్మ ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు.
నందిగామ రూరల్, మార్చి 27: అంబారుపేట సత్యమ్మ ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సీతారామయ్య మాట్లాడుతూ 145రోజులకు గాను రూ. 15.38 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలోకం శ్రీనివాసరావు, వీఆర్వో అప్పారావు, అర్చకులు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.