రేపటి నుంచి అంబారుపేట సత్యమ్మ జాతర
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:52 AM
అంబారుపేట సత్యమ్మవారి జాతర మహో త్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవు తుంది.
నందిగామ రూరల్, ఏప్రిల్ 18: అంబారుపేట సత్యమ్మవారి జాతర మహో త్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవు తుంది. ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు ఉత్స వాలు ఘనంగా నిర్వహిస్తు న్నట్లు ఈవో పామర్తి సీతారామయ్య అన్నారు. 20న అమ్మవారికి పంచామృతాలతో స్నపన, ప్రత్యేక అలంకరణలు, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండ దీప కలస్థాపన, మండపారాధన, 21న గ్రామ బోనాలు, ప్రభ బండ్ల ఊరేగింపు, 21న మూలమంత్ర హోమాలు, 23న విశేష అర్చనలు, రథోత్సవం, 24న మూలమంత్ర హోమాది క్రతువులు జరుగుతాయన్నారు. అనంతరం అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.