Share News

ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:30 AM

కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి వివాదాలకు పోకుండా టీడీపీ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని, రెచ్చగొట్టి, కవ్వించాలని ప్రత్యర్థులు చూసినా సహనం, సంయమనంతో మెలగాలని టీడీపీ కూటమి జగ్గయ్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య సూచించారు.

ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

ప్రత్యర్థులు కవ్వించినా గొడవలకు వెళ్లొద్దు: శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట, జూన్‌ 3: కౌంటింగ్‌ సందర్భంగా ఎలాంటి వివాదాలకు పోకుండా టీడీపీ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని, రెచ్చగొట్టి, కవ్వించాలని ప్రత్యర్థులు చూసినా సహనం, సంయమనంతో మెలగాలని టీడీపీ కూటమి జగ్గయ్యపేట అభ్యర్థి శ్రీరాం తాతయ్య సూచించారు. సోమవారం తన నివాసంలో మాట్లాడిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. కౌంటింగ్‌ నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదో ఏజెంట్లు గమనిం చాలని, అభ్యంతరాలుంటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అవ తల వ్యక్తులు రెచ్చగొట్టినా ఓర్పు వహించాలని సూచించారు. కేడర్‌ ఎప్పటికప్పుడు ఫలితాలు తెలుసుకుంటూ ఇళ్లలోనే ఉండాలని, 144, సెక్షన్‌ 30లు అమలులో ఉన్నందున పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూడాలని కోరారు.

Updated Date - Jun 04 , 2024 | 12:30 AM