Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Feb 01 , 2024 | 01:04 AM

ఉప్పలూరు రైవస్‌ కాలువ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

కంకిపాడు, జనవరి 31: ఉప్పలూరు రైవస్‌ కాలువ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పలూరు గ్రామానికి చెందిన గురు ప్రసాద్‌(19) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్ని స్తున్నాడు. బైక్‌పై ఉప్పలూరు వైపు నుంచి కంకిపాడు వైపు వెళ్తుండగా లారీని ఓవర్‌టేక్‌ చేయబోయాడు. అదుపు తప్పి లారీ కిందపడ్డాడు. పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తర లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 01:04 AM