1.6 కిలోల గంజాయి స్వాధీనం..విక్రేత అరెస్టు
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:30 AM
ఎర్రకట్ట, చిట్టినగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ను కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
![1.6 కిలోల గంజాయి స్వాధీనం..విక్రేత అరెస్టు](https://media.andhrajyothy.com/media/2024/20240224/bb_9d2265131e.jpg)
చిట్టినగర్, ఫిబ్రవరి 25: ఎర్రకట్ట, చిట్టినగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్ను కొత్తపేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 1.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిట్టినగర్ ఎర్రకట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. సీఐ గణేష్ సిబ్బందితో అక్కడకు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న సొరంగంరోడ్డుకు చెందిన రౌడీషీటర్ బియ్యపు లోకేశ్ను అరెస్టు చేసి, గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. సీఐ గణేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.