కృష్ణాజిల్లాలో 1,153 పల్స్పోలియో కేంద్రాలు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:49 AM
జిల్లాలో 1,153 పల్స్పోలియో కేంద్రాలను ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం కోసం ఏర్పాటు చేశామని, ఇందుకోసం 4,898 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని డీఎం హెచ్వో డాక్టర్ గీతాబాయి తెలిపారు.
మచిలీపట్నం టౌన్, ఫిబ్రవరి 29: జిల్లాలో 1,153 పల్స్పోలియో కేంద్రాలను ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం కోసం ఏర్పాటు చేశామని, ఇందుకోసం 4,898 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని డీఎం హెచ్వో డాక్టర్ గీతాబాయి తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సీతాకుమారి, జిల్లా అదనపు వైద్యాధికారి వెంకట్రావు పాల్గొన్నారు. డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో నిర్వహించిన సమావేశంలో డీఈవో తాహెరా సుల్తానా మాట్లాడారు. పాఠశాలల నోటీసు బోర్డుల్లో పోస్టర్లు ఉంచి పల్స్పోలియోపై రెండు రోజుల పాటు విద్యార్థులకు వివరించాలన్నారు.